ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Chandrababu : తెదేపా అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Courtesy: Top Indian News

Share:

విజయవాడ: తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు.  వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపారు. పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీసు ఇచ్చాకే విచారించాలని సీఐడీని ఆదేశించారు.ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇప్పటికే  చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్టయి బెయిల్ పై బయటకొచ్చారు. లిక్కర్ స్కాం కేసులో  టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.