పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఎందుకు ఓటెయ్యాలి? కేటీఆర్ సందేశం

BRS working president KTR : రాష్ట్రంలో లోకసభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

Courtesy: Top Indian News

Share:

రాష్ట్రంలో లోకసభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కోసం అప్పుడే సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.

కాగా, ఈ క్రమంలో 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలనే ప్రాధాన్యతను కేటీఆర్ వివ‌రించారు. తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌రాన్ని పార్ల‌మెంట్‌లో గ‌ట్టిగా, స్ప‌ష్టంగా వినిపించేది కేవ‌లం బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మేన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.కేటీఆర్ తన X(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన పలు గణాంకాలను ట్వీట్ లో ప్రస్తావించారు. 16, 17వ లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హ‌క్కులు, ప్ర‌యోనాల కోసం కేంద్రాన్ని నిల‌దీసిన సంద‌ర్భాన్ని గుర్తు చేశారు. తెలంగాణ హ‌క్కులు, ప్ర‌యోజ‌నాల కోసం పార్ల‌మెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఎన్నిసార్లు ప్ర‌శ్నించారో అనే వివ‌రాల‌ను గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు కేటీఆర్. 16వ లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 2726 సార్లు ప్రశ్నించగా, కాంగ్రెస్ 537 సార్లు, బీజేపీ 12 సార్లు ప్రశ్నించాయని తెలిపారు. 17వ‌ లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 2028 సార్లు ప్రశ్నించగా, కాంగ్రెస్ ఎంపీలు 734 సార్లు, బీజేపీ ఎంపీలు 178 సార్లు ప్రశ్నించినట్లు తెలిపారు. మొత్తంగా.. 16, 17వ లోక్ సభల్లో బీఆర్ఎస్ కేంద్రాన్ని 4,754 సార్లు ప్ర‌శ్నించ‌గా, కాంగ్రెస్ 1271 సార్లు, బీజేపీ కేవ‌లం 190 సార్లు మాత్ర‌మే ప్ర‌శ్నించిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్ర‌మే అని కేటీఆర్ చెప్పారు. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే అని స్ప‌ష్టం చేశారు. నాడు .. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం..తెలంగాణ దళం.. మనమే.. అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.