ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. పీసీసీ పదవికి గిడుగు రాజీనామా

Gidugu Rudraraju: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Courtesy: Top Indian News

Share:

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రుద్రరాజు రాజీనామా చేయడంతో పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయినట్లేనని అంతా భావిస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు.

వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌లో వైతెపా ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌ తన జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌. కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైతెపా పోటీ చేయలేదు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషిచేస్తా’’ అని షర్మిల అన్నారు.