తెలంగాణలో దుమ్మురేపిన మద్యం అమ్మకాలు.. ఒక్కరోజులో ప్రభుత్వానికి భారీ ఆదాయం

నూతన సంవత్సర వేడుకలు 2024 వేళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు.

Courtesy: Top Indian News

Share:

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకలు 2024 వేళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు.

పోలీసుల వివరాల ప్రకారం.. న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్‌లో బ్రీత్‌ అనలైజర్‌ కౌంట్‌ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్‌ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్  అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి  రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి డిసెంబరు 31వ తేదీ ఆదివారం కావడంతో మద్యం దుకాణాలు మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిపోయాయి. మూడు రోజుల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో రూ.658 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తం 4.76 లక్షల కేసుల మద్యం... 3 రోజుల్లో 6.31 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈ మూడు రోజుల్లో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది.