అయోధ్య రామాలయంలోకి రాముడి విగ్రహం.. వేడుకల వివరాలు ఇవే!

Ayodhya : రామమందిరంలో వారం రోజుల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో భాగంగా బుధవారం నాడు మొదటిసారిగా రాములల్లా విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకురానున్నారు.

Courtesy: Top Indian News

Share:

అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రామమందిరంలో వారం రోజుల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో భాగంగా బుధవారం నాడు మొదటిసారిగా రాములల్లా విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకురానున్నారు. నిన్న రాత్రి నుంచే రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 150-200 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ నల్లరాతితో చెక్కారు. ఈ రోజు(బుధవారం) విగ్రహాన్ని ఆలయంలోకి ‘ప్రవేశం’ చేయనున్నారు.

తొలి రోజు ఆచార వ్యవహారాలను ముగిస్తూ వేదపండితులు ఆచార్య శ్రీ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ జనవరి 17న మధ్యాహ్నం జరిగే ఆచారాల గురించి తెలియజేశారు. వేడుకల్లో భాగంగా జలయాత్ర, తీర్థపూజ, బ్రాహ్మణ-బతుక్-కుమారి-సువాసిని పూజ, వర్ధిని పూజ, కలశయాత్ర మరియు ప్రాంగణంలోని శ్రీరామ్ లల్లా విగ్రహాన్ని సందర్శించడం జరుగుతుందని చెప్పారు. కాగా, కలశయాత్రకు భక్తులు పవిత్ర సరయూ నది నుండి నీటిని కుండలలో లేదా "కలశం"లో ఆలయానికి తీసుకెళ్లవచ్చు. 

వారం రోజుల ప్రాణ ప్రతిష్ట వేడుకలకు సంబంధించిన విషయాలు ఇవే
జనవరి 17: విగ్రహం ప్రాంగణంలోకి ప్రవేశం.
జనవరి 18 (సాయంత్రం): తీర్థయాత్ర ఆరాధన, జల యాత్ర, జలదివాస్ మరియు గంధాదివాస్.
జనవరి 19 (ఉదయం): ఔషదివాస్, కేశరాదివాస్, ఘృతాదివాస్.
జనవరి 19 (సాయంత్రం): ధాన్యాదివాస్
జనవరి 20 (ఉదయం): శక్రదివాస్, ఫలదైవం
జనవరి 20 (సాయంత్రం): పుష్పాదివాస్
జనవరి 21 (ఉదయం): మధ్యాహ్నము
జనవరి 21 (సాయంత్రం): నిద్రవేళ
జనవరి 22: ప్రాణ ప్రతిష్ఠ

ఈ ఆచార కార్యక్రమాలు జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యే ప్రాణ ప్రతిష్ఠ యొక్క వేడుకతో ముగుస్తాయి.

ప్రారంభోత్సవానికి 8వేల మంది ప్రముఖులకు ఆహ్వానం
జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. అయితే, రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. సినీ, రాజకీయ, కళాకారులు, సాధువులు ఇలా దేశ ప్రముఖుల అందరికీ పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందాయి. శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సుమారు 8 వేల మందిని ఈ వేడుక‌కు ఆహ్వానించింది.

సుదరంగా అయోధ్య నగరం
రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను, అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మమార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు.