Pakistan: లామినేషన్ పేపర్ కొరత.. ఆగిపోయిన పాస్‌పోర్ట్‌ సేవలు

Pakistan: పాకిస్థాన్ (Pakistan) ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఓవైపు ద్రవ్యోల్బణం.. మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ వాసులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల బస్తాలతో సొమ్ము తీసుకెళ్తుంటే.. సంచులతో సరుకులు వచ్చే పరిస్థితి. పోనీ విదేశాలకు వెళ్లిపోయి.. ఉపాధి, విద్య, అక్కడ ఏదో పనిచేసుకుందామని భావిస్తోన్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పౌరులకు పాస్‌పోర్ట్‌ల(Passport) జారీని నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చే లామినేషన్ పేపర్(Lamination paper) […]

Share:

Pakistan: పాకిస్థాన్ (Pakistan) ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఓవైపు ద్రవ్యోల్బణం.. మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ వాసులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల బస్తాలతో సొమ్ము తీసుకెళ్తుంటే.. సంచులతో సరుకులు వచ్చే పరిస్థితి. పోనీ విదేశాలకు వెళ్లిపోయి.. ఉపాధి, విద్య, అక్కడ ఏదో పనిచేసుకుందామని భావిస్తోన్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పౌరులకు పాస్‌పోర్ట్‌ల(Passport) జారీని నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చే లామినేషన్ పేపర్(Lamination paper) ఆగిపోవడమే కారణం.

దాయాది పాకిస్తాన్(Pakistan) ఆర్థిక వ్యవస్థ(Economic system) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ నెలచూపులే చూస్తుంది. దాంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడటం సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్(Pakistan) పౌరులకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. ఆ దేశం ఉన్నట్టుండి తమ పౌరులకు పాస్‌పోర్టుల (Passport) జారీనీ బంద్ చేసింది. దీనికి కారణం ల్యామినేషన్ పేపర్ (Lamination paper) కొరత. వినడానికి వింతగా ఉన్నా.. ఇదే నిజం. దాంతో కొత్త పాస్‌పోర్ట్‌లను పొందడంలో పాకిస్థానీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అక్కడి విద్యార్థుల బాధ వర్ణనాతీతం. విదేశాల్లో అడ్మిషన్ గడువు(Admission Deadline) ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. తమ పాస్‌పోర్ట్‌లను పొందడంలో విద్యార్థులు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నట్లు పాకిస్తానీ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

చదువు, ఉద్యోగం, విహారం కోసం విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్(Passport) అవసరమయ్యే వేలాది మంది పాకిస్థానీలు (Pakistanis) తమ కష్టాలకు అంతు లేకుండా పోయిందని వాపోతున్నారు. తమ చేతికి పాస్‌పోర్ట్ వచ్చేది ఎప్పుడు, తాము విదేశాలకు వెళ్లేది ఎప్పుడంటూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కనీసం ల్యామినేషన్ పేపర్ కూడా కొనుగోలు చేయలేని దుర్భర స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ(Economic system) ఉండడం విచారకరమని అంటున్నారు. 

ఈ పరిస్థితిపై పాక్‌లోని గుజరాత్‌కు చెందిన జైన్ ఇజాన్(Jain Izaan) అనే యువకుడు మాట్లాడుతూ.. యూకేలో చదువుకోవాలనేది తన చిరకాల కల అని అన్నాడు. దీనిని సాకారం చేసుకునే క్రమంలో యూకే వర్సిటీలో సీటు సాధించాను.. అయితే, పాస్‌పోర్ట్ పొందడంలో అసాధారణ జాప్యం ఇప్పుడు నా ఆకాంక్షలను కూల్చివేసే ప్రమాదం ఉందని వాపోయాడు. ఇజాన్ మాదిరిగానే ఉపాధి, విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పాక్‌లోని వేలాది మంది యువకులు పాస్‌పోర్ట్‌ల(Passport) కోసం పడిగాపులు కాస్తున్నారని అక్కడ మీడియా తెలిపింది. పెషావర్‌కు(Peshawar) చెందిన హీరా(Heera) అనే విద్యార్థి కూడా గుల్‌ లాంటి కష్టమే ఎదురైంది.

 ‘ఇటలీకి నా విద్యార్థి వీసా ఇటీవల వచ్చింది.. నేను అక్టోబర్‌లో ఆ దేశంలో ఉండాలి.. కానీ, పాస్‌పోర్ట్ అందుబాటులో లేకపోవడం అవకాశం చేజారింది ’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రభుత్వం అసమర్థతకు మేము మూల్యం చెల్లించుకోవడం అన్యాయమని వాపోయింది. అయితే, పాకిస్తాన్‌కు ఈ సమస్య కొత్తేమీ కాదు. గతంలో కూడా తమ పౌరులకు పాస్‌పోర్ట్‌లు(Passport) జారీ చేయడంలో ఆ దేశానికి ఇలాంటి అసమర్థతతో కూడిన చరిత్ర ఉంది. 2013లో డీజీఐ అండ్ పీ (DG I&P) ప్రింటర్‌లకు చెల్లించాల్సిన బకాయిలు, ల్యామినేషన్ పేపర్‌ల కొరత కారణంగా పాస్‌పోర్ట్ ప్రింటింగ్ ఇదే విధంగా నిలిచిపోయిన విషయాన్ని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఈ సందర్భంగా నివేదించింది.

ఇదిలాఉంటే.. ” ఈ పరిస్థితి త్వరలో చక్కబడుతుంది. పాస్‌పోర్ట్ జారీ సాధారణంగా కొనసాగుతుంది” అని అంతర్గత మంత్రిత్వ శాఖ మీడియా డైరెక్టర్ జనరల్ ఖాదిర్ యార్ తివానా(Qadir Yar Tiwana) మీడియాతో తెలిపారు. అయితే, తివానా వాదనలతో పాకిస్థానీలు ఏకీభవించడం లేదు. ప్రకటనలు తప్ప ఆచరణ ఉండదని దుయ్యబడుతున్నారు. ఇక పెషావర్‌లోని పాస్‌పోర్ట్(Passport) కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ గతంలో రోజుకు 3వేల నుంచి 4వేల పాస్‌పోర్ట్‌లు ప్రాసెస్ చేయడం జరిగిందని, ప్రస్తుతం రోజుకు 12 నుండి 13 పాస్‌పోర్ట్‌లను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరో నెల లేదా రెండు నెలలు వేచి ఉండవలసి ఉంటుందని అధికారి పేర్కొన్నారు.