కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు.. టీ20 సిరీస్‌ స్వీప్ చేసేందుకు భారత్ సన్నాహాలు!

India Vs Afghanistan: ఇప్పటికే అఫ్గానిస్థాన్‌పై టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇక క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా సిద్ధమైంది.

Courtesy: Top Indian News

Share:

ఇప్పటికే అఫ్గానిస్థాన్‌పై టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇక క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా ఆఖరాటలోనూ అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచి  సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ టీ20 సిరీస్ లో యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కాగా, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగే చివరి, మూడో టీ20లో గెలుపే లక్ష్యంగా  టీమిండియా బరిలోకి దిగుతోంది. 

రోహిత్ ఫాంపై ఫ్యాన్స్ ఆశలు
తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  ఇండియా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. కానీ, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ రెండు సార్లు డకౌట్ అవ్వడమే నిరాశ కలిగించింది. శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ గత రెండు మ్యాచ్‌ల్లో రాణించగా.. సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇక రోహిత్ దాంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరుకుంటున్నారు. ఇక, గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఇండియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. 

హిట్ అయిన శివం దూబే
పలువురు సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శివం దూబే సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో మెరుపు ఫిఫ్టీలతో ఆకట్టుకున్నాడు. ఇక 14 నెలల తర్వాత ఆడిన తొలి ఇంటర్నేషనల్ టీ20లో కోహ్లీ 16 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 29 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌ అనంతరం ఇక ఐపీఎల్‌ మాత్రమే అందుబాటులో ఉంది. చిన్న గాయంతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైన ఓపెనర్ యశస్వి గత పోరులో ఫిఫ్టీతో సత్తా చాటాడు. దాంతో ఇప్పుడు  మరో ఓపెనర్  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే అందరి దృష్టి ఉంది.  

బెంగళూరులో అయినా రోహిత్ తను బ్యాట్ ఝుళిపిస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. ఇక, తుది జట్టులో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్, పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్ రావొచ్చు. కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జితేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బరిలోకి దిగుతాడు. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి ఊరట దక్కించుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే ఆ జట్టు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. స్పిన్‌ ఆయుధంగా బరిలోకి దిగిన అఫ్గాన్‌.. భారత జట్టుకు సరైన పోటీనివ్వలేకపోయింది. చిన్న బౌండరీలు కలిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పరుగులకు పెట్టింది పేరు. అయితే అందుకు భిన్నంగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఇక చివరి టీ20 లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి మరి.